Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ కారణంగా.. ఆకుకూరలు అమ్మలేక.. అక్రమ మద్యం రవాణా..

విశాఖపట్నం, సబ్బవరం మండలం గొల్లపల్లి గ్రామం వద్ద సోమవారం ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్ కార్ లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్థానిక ఎక్సైజ్  అధికారులు పట్టుకున్నారు.

విశాఖపట్నం, సబ్బవరం మండలం గొల్లపల్లి గ్రామం వద్ద సోమవారం ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్ కార్ లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్థానిక ఎక్సైజ్  అధికారులు పట్టుకున్నారు. వంగలేరు నుండి సన్యాసి రావు అనే వ్యక్తి ఈ మద్యం బాటిళ్లు తీసుకువస్తుండగా పట్టుకున్నారు. ఇతని దగ్గరినుండి సుమారు పదిహేడువేల రూపాయల విలువచేసే 79  మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులు మద్యం తరలిస్తున్న వ్యక్తి తో పాటు కారును అదుపులోకి తీసుకొని  మద్యం సీసాల తో పాటు కారును సీజ్ చేశామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారి ఆర్ ప్రసాద్ తెలిపారు.