Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. సోమవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఛైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ... శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించామని... కరోనా నుండి ప్రజలను  కాపాడి చల్లగా చూడాలని అమ్మవారిని‌ వేడుకున్నట్లు శివప్రసాద్ శర్మ తెలిపారు. 

విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి. సోమవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఛైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ... శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోందన్నారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించామని... కరోనా నుండి ప్రజలను  కాపాడి చల్లగా చూడాలని అమ్మవారిని‌ వేడుకున్నట్లు శివప్రసాద్ శర్మ తెలిపారు.