Asianet News TeluguAsianet News Telugu

వినుకొండలో క్షుద్రపూజలు కలకలం... ఒకే ఇంట్లో తల్లీకొడుకు మృతి

పల్నాడు జిల్లా వినుకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. 

పల్నాడు జిల్లా వినుకొండలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీనివాసనగర్ కాలనీలోని వార్డు వాలంటీర్ శ్రీనివాసరావు ఇంటిపక్కన జిల్లేడు చెట్టుకు తాళితో పాటు మట్టికుండలు, చెక్క బొమ్మలు వంటి వస్తువులు లభించాయి. ఈ క్షుద్ర పూజల కారణంగానే ఇటీవల తన తండ్రి కోటేశ్వరరావు, నాన్నమ్మ వెంకటమ్మ మృతిచెందినట్లు వాలంటీర్ ఆందోళన వ్యక్తం చేసారు. క్షుద్ర పూజలు చేసిన మాంత్రికుడు, చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని... క్షుద్ర పూజల సామాగ్రిని తొలగించాలని శ్రీనివాసరావు కుటుంబం డిమాండ్ చేస్తోంది.