Asianet News TeluguAsianet News Telugu

కాల్ లిప్ట్ చేయలేదని... పోలీస్ స్టేషన్ ఎదుట వైసిపి ఎమ్మెల్యే ధర్నా

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హనుమాన్ జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హనుమాన్ జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం విషయంలో గ్రామ సర్పంచ్ అరెపల్లి శ్రీనివాసరావు(టీడీపీ)కి వైసిపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన పై వైసిపి కార్యకర్తలు ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యహారంలో తాజా పరిస్థితి మరియు సమాచారంపై హనుమాన్ జంక్షన్ సిఐ రమణతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పలుమార్లు ఫోన్ చేశారు. ఐతే సిఐ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేకా ప్రతాప్ అప్పారావు నేరుగా జంక్షన్ సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.సిఐ లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. సిఐ వచ్చే వరకు కార్యాలయం వద్దే ఉంటానని ఎమ్మెల్యే పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభిమానులు సర్కిల్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. 

Video Top Stories