Bharat Bandh : వామపక్షాల ఆందోళన...దేశవ్యాప్త బంద్ కు పిలుపు...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా విశాఖ గాజువాక ఏరియాలో అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దేశంలోని 250 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలని చూస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మే చేస్తున్నట్టు నాయకులు తెలిపారు. భారత్ బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోనూ విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు.