Asianet News TeluguAsianet News Telugu

ఇళ్ల స్థలం అడిగితే బూటు కాలితో తంతారా.. ఇదేనా జగన్ రెడ్డి పాలన.. నారా లోకేష్...


జగన్ రెడ్డి పాలన లో దళితులకు జీవించే హక్కు లేదా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 


జగన్ రెడ్డి పాలన లో దళితులకు జీవించే హక్కు లేదా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణా కి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేసారు. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు అంటూ మండిపడ్డారు. ఇళ్ల పట్టా అడిగినందుకు  పలాస మండలం టెక్కలిపట్నం గ్రామానికి చెందిన మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేసారు. న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెలితే స్థానిక సిఐ నడి రోడ్డు పై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు. వైకాపా నాయకుల్లా వ్యవహరిస్తూ ప్రజలను హింసిస్తున్న పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశాడు

Video Top Stories