Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కు హజ్ పవిత్ర జలం అందించిన మైనారిటీ నేతలు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు అతి పవిత్రంగా బావించే జలాన్ని అందజేసారు హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు అతి పవిత్రంగా బావించే జలాన్ని అందజేసారు హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్. ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిన నేపథ్యంలో అక్కడి నుండి తెచ్చిన పవిత జలం (జమ్ జమ్ వాటర్) ను ముఖ్యమంత్రికి అందజేసారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న హజ్ కమిటీ ఛైర్మన్ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్ బాషా, హజ్ కమిీ సభ్యులు మనీర్ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్ తదితరులు సీఎంకు పవిత్ర జలం అందజేసారు. ఈ సందర్భంగా మైనారిటీలకు సంబంధించి పలు అంశాలపై కూడా సీఎంతో ముస్లీం నాయకులు, హజ్ కమిటీ సభ్యులు చర్చించారు. 

Video Top Stories