Asianet News TeluguAsianet News Telugu

ఎల్లుండి పెళ్లనగా... సాఫ్ట్ వేర్ పెళ్లికొడుకును అతి కిరాతకంగా నరికి...

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డలో తెల్లవారు జామున వాకింగ్ కి వెళ్లిన తండ్రి కొడుకుపై కొందరు దుండగులు కత్తులతో దాడి చేశారు.  ఈ దాడిలో తండ్రి స్వల్ప గాయాలతో బయటపడగా కొడుకు హర్షవర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరిని స్థానిక హాస్పిటల్ కు తరలించిన చికిత్స అందిస్తున్నారు.

హర్షవర్ధన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా ఎల్లుండి అతడి పెళ్లి. ఈ సమయంలోనే దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ దాడికి ప్రేమ వ్యవహరం ఏమయినా కారణమా లేదా పాతకక్షలు కారణమా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.