Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో మైనర్ బాలిక సజీవదహనానికి ప్రయత్నం...

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. 

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేయడానికి ప్రయత్నించారు. అంపోలు భువనేశ్వరి అనే 13 ఏళ్ల బాలికను అర్థరాత్రి ఇంటివెనకాలకు లాక్కెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే 90 శాతం కాలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తేల్చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.