కృష్ణా జిల్లా : మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె
కృష్ణాజిల్లా నందిగామలో మునిసిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు.
కృష్ణాజిల్లా నందిగామలో మునిసిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వైసిపి ప్రభుత్వం వచ్చి నుండి హెల్త్ అలవెన్సులు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని అంతేకాకుండా రోజువారీ వాడే దుస్తులు, బ్లౌజులు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలని లేనిపక్షంలో నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.