Asianet News TeluguAsianet News Telugu

బాపట్ల ఎంపీపై జరిగిన దాడిని ఖండించిన మంత్రులు

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. 

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. రాజధాని ప్రాంత మహిళలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోమని హోం మంత్రి సుచరితతో పాటు తానేటి వనిత, విశ్వరూప్, అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. విజయనగరంలో ముఖ్యమంత్రి పర్యటనకు హాజరయ్యేందుకు విశాఖకు చేరుకున్న మంత్రులు.. అవంతి క్యాంప్  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ చేసిన కుంభకోణాలు, అక్రమాలు బయటపడుతున్న నేపథ్యంలోనే మహిళలను రంగంలోకి దించి దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ తరహా ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు వుంటాయని  దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.