రథానికి నిప్పు: విచారణకు మంత్రి వెల్లంపల్లి ఆదేశం
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో ఆలయ రధానికి ఎవరో నిప్పు పెట్టారు ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు.
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిగ్రుంటలో ఆలయ రధానికి ఎవరో నిప్పు పెట్టారు ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మార్చి 5 నుంచి వారం రోజులు పాటు వెంకటేశ్వర స్వామి కి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు .