Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు నోరు తెరవలేదే... నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా? : పవన్ పై రోజా వ్యాఖ్యలు

అమరావతి : విశాఖపట్నంలోని రుషికొండపై చేపట్టిన నిర్మాణాలపై జరుగుతున్న వివాదంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. 

అమరావతి : విశాఖపట్నంలోని రుషికొండపై చేపట్టిన నిర్మాణాలపై జరుగుతున్న వివాదంపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఇదే రిషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే ఇదే పవన్ కల్యాణ్ నోరు తెరవలేదు... అప్పుడు నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడని రోజా మండిపడ్డారు. ఈ రోజు ప్రభుత్వ భూముల్లో అన్ని అనుమతులతో ప్రభుత్వ భవనాలే కడుతుంటే ఏదో జరిగిపోతోందని అంటున్నారు... అతడి ఊగుడు చూస్తే మెంటల్ హాస్పిటల్లో చేరడానికి సిద్దంగా వున్నట్లు అనిపిస్తోందన్నారు. ఓ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు కనీసం వార్డు మెంబర్ కూడా కానివాడు ఏ అర్హత లేనివాడు పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్నాడంటూ పవన్ పై మండిపడ్డారు రోజా. వీళ్లు ఏం చేసినా రుషికొండపై జరిగే నిర్మాణాలను ఆపలేరని రోజా అన్నారు.