అమరావతి గ్రామాల్లో బొత్స ఆకస్మిక పర్యటన... మతలబేంటో? (వీడియో)
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా పర్యటించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా పర్యటించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని రాజధాని గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో తన వాహనాన్ని నిలిపి గ్రామస్తులతో ముచ్చటించారు. అయితే ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి గ్రామాల్లో ఆయన ఆకస్మిక పర్యటన చేపట్టండంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. ఆయన పర్యటన వెనుక మతలబేంటోనని చర్చించుకుంటున్నారు.