ఏపీలో వైన్ షాపులు తెరిచే ఉంటాయి.. ఎగబడొద్దు.. అవంతి శ్రీనివాస్..
విశాఖ లో కోవిడ్-19 టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులతో మంత్రి అవంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.
విశాఖ లో కోవిడ్-19 టాస్క్ఫోర్స్ ఉన్నతాధికారులతో మంత్రి అవంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఉదయం 6 గంటలనుండి 01 గంటల సామూహికంగా లేకుండా వ్యక్తిగతంగా పనులు చేసుకోవచ్చన్నారు. కంటైన్మెంట్ జోన్ లో మాత్రం యధావిధిగా లాక్ డౌన్ కొనసాగుతుందని, ఎలాంటి అనుమతులు ఉండవు అన్నారు. షాపింగ్ మాల్, సినిమా థియేటర్లో ఫంక్షన్ హాల్స్ టూరిస్ట్ ప్రదేశాలు వీటికి అనుమతి లేదు. కేంద్రం ఆదేశాల మేరకు వైన్ షాపులు తెరిచాం.. మాకు ఆసక్తి లేదు. ఇప్పటికి ఇప్పుడు మూసే ఆలోచన మాకు లేదు.జనాలు మందు దొరకదేమో అనుకొని బారులు తీరుతున్నారు. రెండు రోజుల తర్వాత ఈ పరిస్థితి ఉండదు..మద్యం ఎక్కడికి పారిపోదు.