Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఆవిర్భావ దినోత్సవం... శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిల్ యాదవ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భవించి పదేళ్లు పూర్తయి 11వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆవిర్భవించి పదేళ్లు పూర్తయి 11వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వైయస్సార్ కాంగ్రెస్ ప్రస్థానాన్ని వివరించారు. గత పదేళ్లుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్ అన్నకు ఎల్లప్పుడు ఉండాలని అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు.