Asianet News TeluguAsianet News Telugu

ఏటి నీరు కలుషితం.. కుప్పలు, తెప్పలుగా చచ్చిపోతున్న చేపలు..

విశాఖ జిల్లా, మునగపాక మండలంలో ఉన్న గవర్ల అనకాపల్లి ఆవ ఖండం ఏటి నీరు కలుషితం అవ్వడంతో ఏటిలోని మత్స్య సంపద మొత్తం చచ్చిపోయింది. 

విశాఖ జిల్లా, మునగపాక మండలంలో ఉన్న గవర్ల అనకాపల్లి ఆవ ఖండం ఏటి నీరు కలుషితం అవ్వడంతో ఏటిలోని మత్స్య సంపద మొత్తం చచ్చిపోయింది. పరవాడ ఫార్మాసిటీ వ్యర్ధాలను నీటిలోకి వదిలేయడం వల్లే మత్స్య సంపద చచ్చిపోయిందని, ఈ నీటినే పంటపొలాలకు వినియోగిస్తామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజీ నీరు కూడా ఈ ఏటిలోకే వస్తోందని  రైతులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేపలు చచ్చిపోయి మూడు రోజులైనా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదన్నారు.