Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ చారిటీ డొనేషన్...నమ్మారో..అంతే సంగతులు...

తనకున్న రూ. 39 కోట్ల సొమ్మును దానం చేస్తున్నట్లు ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన సంజయ్ సింగ్ కు ఈ మెయిల్ వచ్చింది.

తనకున్న రూ. 39 కోట్ల సొమ్మును దానం చేస్తున్నట్లు ఓ మహిళ నుంచి విశాఖకు చెందిన సంజయ్ సింగ్ కు ఈ మెయిల్ వచ్చింది. దీన్ని నమ్మిన సంజయ్ సింగ్ రిఫ్లై ఇచ్చాడు. అయితే మనీ ట్రాన్స్ఫర్ చేశామని డబ్బు చేతికి రావాలంటే కస్టమ్ డ్యూటీ, ఇన్సూరెన్స్, ఆర్ బి ఐ చార్జెస్ చెల్లించాలని సదరు మహిళ తెలిపింది. దీంతో ఆమె మాటలు నమ్మి పలు మార్లు వివిధ బ్యాంక్ అకౌంట్స్ కు రూ. 6,62,000 సంజయ్ సింగ్ చెల్లించాడు. డబ్బుపంపి ఎన్నిరోజులైనా రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నలుగురు నైజీరియన్స్, మేఘాలయాకు చెందిన మరో మహిళను అరెస్ట్ చేశారు.

Video Top Stories