అమరావతి : దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరిన ఆకతాయి...
మంగళగిరి, కృష్ణాయ పాలెం అమరావతి నిరసన దీక్ష శిబిరంపై ఓ వ్యక్తి మద్యం బాటిల్ విసిరాడు.
మంగళగిరి, కృష్ణాయ పాలెం అమరావతి నిరసన దీక్ష శిబిరంపై ఓ వ్యక్తి మద్యం బాటిల్ విసిరాడు. విజయవాడ నుంచి సచివాలయంకి వెళ్తున్న సిటీ బస్సులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కృష్ణాయపాలెం శిబిరం మీద మద్యం బాటిల్ విసిరాడు. ఇది గమనించిన కృష్ణాయ పాలెం ప్రజలు మందడం గ్రామస్తులకు విషయం తెలిపారు. వీరు మందడంలో నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో మందడం, కృష్ణాయపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాటిల్ విసిరిన వ్యక్తిని ధరణికోటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిగా గుర్తించారు.