Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ : జడ్జి బంట్రోతునంటూ నమ్మించి..44వేలకు టోకరా...

కృష్ణాజిల్లా, నూజివీడులోని శివాని ఆటో ఫైనాన్స్ కి ఓ గుర్తు తెలియని వ్యక్తి  బైక్ అమ్మడానికి వచ్చాడు. 

కృష్ణాజిల్లా, నూజివీడులోని శివాని ఆటో ఫైనాన్స్ కి ఓ గుర్తు తెలియని వ్యక్తి  బైక్ అమ్మడానికి వచ్చాడు. అది జడ్జిగారి బైక్ అని తను జడ్జి బంట్రోతునని చెప్పి నమ్మించాడు. 44వేల రూపాయలు ఫైనాన్స్ వ్యాపారి దగ్గర తీసుకున్నాడు. జడ్జి సంతకంకోసం కోర్టు ప్రాంగణంలోకి తీసుకెళ్లి..అక్కడ మాయమయ్యాడు. దీంతో మోసపోయానని తెలిసిన ఫైనాన్స్ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. సి.సి. టీవీ ఫుటేజ్ ల ఆధారంగా ఫోటోలు విడుదల చేసిన పోలీసులు, ఇలా ఎవ్వరు వచ్చినా వారి ఆధార్ కార్డ్ తీసుకోకుండా బేరసారాలు చేయద్దని హెచ్చరించారు. పట్టించినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు.