Asianet News TeluguAsianet News Telugu

తీసుకున్న అప్పు చెల్లించలేదని దారుణం..సైకిల్ చైన్ తో దాడి...

నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. 

నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదని తల్లీ, వికలాంగురాలైన కూతురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడో వ్యక్తి. గతయేడాది మున్సిపల్ ఉద్యోగి అయిన శేషన్న దగ్గర వైఎస్సార్ నగర్ లో నివసించే మరియమ్మ లక్ష రూపాయల అప్పు తీసుకుంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవుతుండడంతో శేషన్న ఇంటిని రాసివ్వాలని పట్టుబట్టాడు. దీనికి వారు నిరాకరించడంతో సైకిల్ చైన్ తో దాడిచేసి, కత్తితో పొడవబోయాడు మరియమ్మ, వికలాంగురాలైన కూతురి కేకలతో ఇరుగుపొరుగు రావడంతో శేషన్న పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.