Asianet News TeluguAsianet News Telugu

ఒకరినొకరు చున్నీతో కట్టుకుని... నాగావళి నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

విజయనగరం: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమ జంట స్నేహితులకు సెల్పీ వీడియో పంపించడం విజయనగరం జిల్లాలో సంచలనం రేపింది. 

విజయనగరం: ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ప్రేమ జంట స్నేహితులకు సెల్పీ వీడియో పంపించడం విజయనగరం జిల్లాలో సంచలనం రేపింది. ఇలా ఈనెల 28నుండి కనిపించకుండా పోయిన ప్రేమజంట తాజాగా తోటపల్లి రిజర్వాయర్లో శవాలుగా తేలారు. స్పిల్ వేకు 200 మీటర్ల దూరంలో వీరి మృతదేహాలను బుధవారం నాడు గుర్తించారు.విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాం ప్రాంతానికి చెందిన గాయత్రిలు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి ప్రేమకు పెద్దల నుండి అమనుతి లేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.  రెండు రోజుల క్రితం  తోటపల్లి రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు.ఒకరినొకరు తమ నడుములకు చున్నీని చుట్టుకొని నాగావళి నదిలో దూకి చనిపోయారు. దాదాపు 42 గంటల తర్వాత వీరి మృతదేహాలు లభించాయి. 

Video Top Stories