కంటెయినర్ లారీ పార్కింగ్ చేస్తుంటే ఎగిసిన మంటలు.. ఒకరికి తీవ్రగాయాలు..
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలసలో అగ్ని ప్రమాదం జరిగింది.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబటి వలసలో అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద కంటైనర్ లారీ ని రోడ్డు ప్రక్కన పార్కింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.