Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మద్యం ఎఫెక్ట్ : ఫుల్ గా తాగి వాహనాన్ని ఢీకొట్టి.. వ్యక్తి మృతి..

కృష్ణాజిల్లా మైలవరంలో మద్యం అమ్మకాలు మొదలు పెట్టిన తొలి రోజే విషాదం చోటు చేసుకుంది. 

కృష్ణాజిల్లా మైలవరంలో మద్యం అమ్మకాలు మొదలు పెట్టిన తొలి రోజే విషాదం చోటు చేసుకుంది. మైలవరం గ్రామానికి చెందిన ఎరువు చంద్రశేఖర్ రెడ్డి 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరవడంతో మద్యం తాగి జి కొండూరు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామ శివారుల్లో ఈ ఘటన జరిగింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.