Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు : నల్లబ్యాడ్జీలు, నల్ల బెలున్లు, నల్ల పావురాలు...టీడీపీ నేతల వినూత్న నిరసన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకించారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకించారు. నగరంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నల్లబెలున్లు, నల్ల పావురాలు ఎగురవేసి నిరసన తెలిపారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తే విశాఖకు కాకుండా రాజధానిని త్యాగం చేసిన కర్నూలుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ముందు ముందు మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.