Asianet News TeluguAsianet News Telugu

టిడిపి కార్యకర్తపై కత్తులతో దాడి... వైద్యం అందకుండా కుట్ర: కొల్లు రవీంద్ర ఆగ్రహం

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్నిపాలిటీలో పోలింగ్ సందర్భంగా దారుణ సంఘటన చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్నిపాలిటీలో పోలింగ్ సందర్భంగా దారుణ సంఘటన చోటుచేసుకుంది. 13వ డివిజన్ లో టీడీపీ సానుభూతిపరుడు దినకర్ పై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో దినకర్ తల, మొహం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇలా తీవ్రంగా గాయపడిన దినకర్ ను టీడీపీ శ్రేణులు హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.టీడీపీ కార్యకర్తపై దాడి గురించి తెలుసుకుని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకున్నారు. వైసీపీ నేతలు దాడికి గురైన దినకర్ పరామర్శించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. దినకర్ కు వైద్యం అందించడంలో డాక్టర్లు అలసత్వం వహిస్తున్నారని వీరు ఆరోపించారు. డాక్టర్ల తీరుపై రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని హింస రాజకీయాలు చేస్తున్నారని  కొల్లు రవీంద్ర మండిపడ్డారు.