Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు పిల్లలను తోసి.. తానూ గోదావరిలో దూకిన విలేకరి... ఎందుకంటే...

యానాంలోని ఎదుర్లంక బ్రిడ్జి వద్ద ఓ విలేకరి తన ఇద్దరు పిల్లలను గోదావరిలోకి తోసేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

యానాంలోని ఎదుర్లంక బ్రిడ్జి వద్ద ఓ విలేకరి తన ఇద్దరు పిల్లలను గోదావరిలోకి తోసేసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని దూరంనుండి గమనించిన వారు వచ్చి వెంటనే గాలించినా తండ్రీ, పిల్లలు దొరకలేదు. చనిపోయిన వ్యక్తి కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన శ్రీనివాస్ అని యానాం తోటావారి వీధిలో కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడని, ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడని తెలిసింది. పెళ్లై ఆరేళ్లు అయ్యింది. హర్ష (5), హరిణి(5) ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వారి ఫ్యామిలీలో ఏవో గొడవలు. శ్రీనివాస్‌పై యానాం పోలీస్‌ స్టేషన్‌లో భార్య కంప్లైంట్ ఇచ్చింది. ఇదే శ్రీనివాస్ పిల్లలతో సహా చనిపోవడానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.