Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో రౌడీరాజ్యం... టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై పట్టపగలే హత్యాయత్నం

కృష్టా జిల్లా విజయవాడలో ప్రభుత్వ సిబ్బందిపైనే హత్యాయత్నం జరిగింది. 

కృష్టా జిల్లా విజయవాడలో ప్రభుత్వ సిబ్బందిపైనే హత్యాయత్నం జరిగింది. నగరంలోని కృష్ణలంకలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడి ఓ భవన యజమాని దాడికి యత్నించాడు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో రెచ్చిపోయిన భవన యజమాని బిల్డింగ్ ఇన్స్ పెక్టర్, మహిళా వార్డు సెక్రటరీలపై ఐరన్ రాడ్డుతో దాడికి యత్నించాడు. అధికారులపై దాడి వెనుక స్థానిక కార్పొరేటర్ హస్తం వుందన్న ప్రచారం జరుగుతోంది.