Asianet News TeluguAsianet News Telugu

అమరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ... కృష్ణా తీరంలో కార్తీక శోభ

పల్నాడు : పవిత్ర కార్తీకమాసంలో చివరి సోమవారం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా తీరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

పల్నాడు : పవిత్ర కార్తీకమాసంలో చివరి సోమవారం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా తీరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పల్నాడు జిల్లా అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం కూడా భక్తులు పోటెత్తారు. పిల్లాపాపలతో కలిసి ఆలయానికి చేరుకుంటున్న భక్తులు నదీస్నానం ఆచరిస్తున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు చేస్తున్నారు. అలాగే మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇలా అమరేశ్వర ఆలయం కార్తీక శోభతో వెలిగిపోతోంది.