Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ చేతికి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021–22 వార్షిక నివేదిక

 
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021–22 వార్షిక నివేదికను అందజేసింది. 

First Published Apr 29, 2022, 2:40 PM IST | Last Updated Apr 29, 2022, 2:39 PM IST

 అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021–22 వార్షిక నివేదికను అందజేసింది. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత వార్షిక నివేదికను అందజేసారు. హెచ్‌ఆర్‌సీ సీఈవో, సెక్రటరీ ఎస్‌వి రమణమూర్తి, కమిషన్‌ అధికారులు బొగ్గరం తారక నరసింహ కుమార్, కే.రవికుమార్‌ కూడా సీఎంను కలిసినవారిలో వున్నారు.  ఈ సందర్భంగా కమిషన్‌ సభ్యుడు శ్రీనివాసరావు రచించిన ''కంబాటింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఇండియా – రోల్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ ఏజెన్సీస్‌'' పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు