Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పనులతో ప్రజలే ఇదేం ఖర్మ అనుకుంటున్నారు: హోమంత్రి వనిత ఎద్దేవా

అమరావతి : పోలవరం సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రోడ్డుపైనే భైఠాయించి ఆందోళనకు దిగిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. 

అమరావతి : పోలవరం సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రోడ్డుపైనే భైఠాయించి ఆందోళనకు దిగిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఇదేమీ ఖర్మ అంటూ చంద్రబాబు చేస్తున్న పనులుచూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. టీడీపీ నాయకులను చూసి ప్రజలు కూడా ఇదేమి ఖర్మ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేసారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కావాలనే పోలవరం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించి చంద్రబాబు రాద్దాంతం చేసాడని అన్నారు. అనుమతులు లేకుండా జనసమూహంతో నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లలేమని 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తెలియదా... అయినా ఎలా వెళ్లాలని అనుకున్నారు? అంటూ హోమంత్రి వనిత నిలదీసారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని హోంమంత్రి సూచించారు.