Asianet News TeluguAsianet News Telugu

అక్కుల చెరువు ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం.. అధికారులపై మండిపడ్డ మేకతోటి సుచరిత...

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలోని అక్కుల చెరువును హోంమంత్రి సుచరిత పరిశీలించారు.

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలోని అక్కుల చెరువును హోంమంత్రి సుచరిత పరిశీలించారు. చెరువు ఆధునీకరణ గురించి ఆరా తీసి, ఏళ్ళు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంపై ప్రశ్నించారు. నిర్లక్షంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కుల చెరువు అభివృద్ధి నిధులు భారీగా నిరుపయోగంగా అయ్యాయని,ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం నెరవేరకుండా పోతోందని మేకతోటి సుచరిత అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 12 గ్రామాలకు త్రాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రాజెక్ట్  ఏ ఒక్క గ్రామానికి కూడా నీరు అందిన దాఖలాలు లేవని హోంమంత్రి అన్నారు.