Asianet News TeluguAsianet News Telugu

ప్రైమరీ హెల్త్ సెంటర్ లోనూ లంచం గోల.. పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్..

విశాఖ ఏజెన్సీ డివిజన్ పరిధిలోని మినుములూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ చెట్టి శోభారాణిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

విశాఖ ఏజెన్సీ డివిజన్ పరిధిలోని మినుములూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ చెట్టి శోభారాణిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కె. భాగ్యవతి అనే ఏఎన్ఎం దగ్గర పంతొమ్మిదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఫీల్డ్ ట్రావెల్ అలవెన్స్ బిల్లు పాసు చేయడానికి ఈ లంచం అడిగిందని భాగ్యవతి తెలిపింది. శోభారాణిని విశాఖపట్నం ఏ సి బి స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.