విశాఖలో టీడీపీ నేత గో కార్టింగ్ కూల్చివేత..
విశాఖ, కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్కు చెందిన గోకార్టింగ్ను అధికారులు తొలగిస్తున్నారు.
విశాఖ, కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకుడు కాశీ విశ్వనాథ్కు చెందిన గోకార్టింగ్ను అధికారులు తొలగిస్తున్నారు. సర్వే నెంబర్ 299/1, 301ల్లో ఉన్న 4 ఎకరాలలోని నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగింపు పనులు చేపట్టారు. CRZ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారంటూ ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. అయితే టీడీపీ నాయకులే టార్గెట్గా వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.