Asianet News TeluguAsianet News Telugu

వసతి గృహంలో బాలికల చేత వెట్టిచాకిరి

విశాఖపట్నం: ఏజెన్సీలోని డుంబ్రిగూడ మండలం జామిగూడా ఆశ్రమ బాలికల వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న దారుణం బయటపడింది.

విశాఖపట్నం: ఏజెన్సీలోని డుంబ్రిగూడ మండలం జామిగూడా ఆశ్రమ బాలికల వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న దారుణం బయటపడింది. విద్యార్థుల చేత కొండ మీద నుండి బండరాళ్లను మోయిస్తున్నారు. ఈ దృశ్యాలు అటుగా వెళ్తున్న మీడియా ప్రతినిధుల కంట పడడంతో విషయం వెలుగులోకి  వచ్చింది. రాష్ట్ర మంత్రి సూచనలు జారీ చేసి ఉన్నపటికీ అధికారులు పర్యవేక్షించకపోవడం వల్లనే ఇలాచేస్తున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు కోరుతున్నారు.