Asianet News TeluguAsianet News Telugu

ఇళ్ల స్థలాల కేటాయింపులో గోల్ మాల్.. లిస్టుల్లో పేర్లు తారుమారు..

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని చౌడేశ్వరి మాత దేవాలయం ప్రక్కనున్న 32 నిరుపేద కుటుంబాలు ఇళ్ల స్థలాలకోసం ఆందోళకు దిగాయి.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని చౌడేశ్వరి మాత దేవాలయం ప్రక్కనున్న
32 నిరుపేద కుటుంబాలు ఇళ్ల స్థలాలకోసం ఆందోళకు దిగాయి. ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలివ్వాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఇప్పటికే లిస్టులు రెడీ అయ్యాయి. అలా తయారైన మొదటి లిస్టులో ఇక్కడి 32 కుటుంబాల పేర్లు ఉన్నాయి. రెండో లిస్టులో వీళ్ల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో తమకు అన్యాయం చేస్తున్నారని వీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ కు మొరపెట్టకున్నారు. స్టాంపు పేపర్లమీద సంతకాలు కూడా తీసుకుని ఇప్పుడు లిస్టులో పేరు లేదంటున్నారని వాపోతున్నారు బాధితులు.