Asianet News TeluguAsianet News Telugu

తెరిచిన మొదటి రోజే.. హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్..

కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం రంగన్నగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది.

కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం రంగన్నగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక కొల్లి సుబ్బారావు హోటల్ లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో హోటల్ పూర్తిగా దగ్గమయ్యింది. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మంటలకు ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదు లక్షల ఆస్తి నష్టం 
జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో మరింత ఆస్తినష్టం తప్పింది. ఈరోజు నుంచి హాటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో అన్నిప్రాంతాల్లో హోటళ్లు తెరుచుకున్నాయి.