Asianet News TeluguAsianet News Telugu

20 లక్షల విలువైన గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్..

విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వాహనాల తనిఖీలో 20 లక్షలు విలువచేసే 970 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వాహనాల తనిఖీలో 20 లక్షలు విలువచేసే 970 కేజీల గంజాయిని పట్టుకున్నారు. లంబసింగి వద్ద మల్కనగిరి నుండి వస్తున్న ఉత్తర ప్రదేశ్ లారీని తనిఖీ చేయగా అక్రమంగా రవాణా చేస్తున్న 970 కేజీల గంజాయి దొరికింది.  ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని సీఐ సింహాద్రి తెలిపారు. వీరి వద్దనుండి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండకు తరలిస్తున్నామని అన్నారు.