Asianet News TeluguAsianet News Telugu

జగన్ మగాడు చెప్పి మరీ చేస్తున్నాడు..మాజీ ఎంపీపీ మల్లెల హరీంద్రనాథ్

రాయపూడిలో జరిగిన గ్రామసభ రసాభసాగా మారింది. 

రాయపూడిలో జరిగిన గ్రామసభ రసాభసాగా మారింది. రైతులను మోసం చేసి, జియన్ రావు కమిటీకి సంతకాలు చేయించారని గ్రామ సభలో పాల్గొన్న మాజీ ఎంపీపీ మల్లెల హరీంద్రనాథ్ చౌదరిని గ్రామస్తులు నిలదీశారు. రైతులతో చర్చించకుండా జియన్ రావు కమిటీకి సంతకాలు ఎలా చేయించారని మండిపడ్డారు. రాయపూడి లో జియన్ రావు కమిటీకి రైతుల చేత సంతకాలు చేయించినమాట వాస్తవమేనని, రాజధాని ఇక్కడే ఉండేలా వారితో మాట్లాడానని హరీంద్రనాధ్ అన్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో అనేక దొంగ తీర్మానాలు చేశారని, ఒక్క తీర్మానం కూడా మినిట్స్ బుక్లో రాయలేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం అన్నారు. అమరావతిలో ఇంత అభివృద్ధి జరిగినా ఈ రాయపూడి లో వైసీపీ 200 ఓట్ల మెజారిటీ ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలన్నాడు. జగన్ మగాడిలా ప్రతి ఒక్క విషయం చెప్పి, దాన్నే చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.