Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు వర్తించే క్వారంటైన్.. వైవీ సుబ్బారెడ్డికి వర్తించదా??.. నిమ్మకాయల చినరాజప్ప

ఏపీలో కరోనా వైరస్  విలయతాండవం చేస్తుంటే సిఎం జగన్ మాత్రం నవరత్నాలపై దృష్టి పెట్టారని మాజీ డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.

ఏపీలో కరోనా వైరస్  విలయతాండవం చేస్తుంటే సిఎం జగన్ మాత్రం నవరత్నాలపై దృష్టి పెట్టారని మాజీ డిప్యూటీ సిఎం, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఇళ్ళ స్థలాలకు ఇవ్వాలనుకున్న మడ అడవుల భూములకు కేంద్రం అడ్డుకట్టవేసింది. మద్యపాన నిషేధం విధానమని చెప్పిన వైసీపీ దానిపై ఆదాయానికి ప్రయత్నిస్తోంది.. సేల్స్ టాక్స్ పోయినందున అర్జంట్ ఆదాయం కోసం లాక్ డౌన్ లోనే దుకాణాలు తెరవాలని తహతహలాడుతున్నారు. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వైవి సుబ్బారెడ్డి ఇతర రాష్ట్రం నుంచి ఎలా వస్తారు..లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎలా దర్శనం చేసుకుంటారు..ఆయనపై ఏం చర్య తీసుకుంటారు? హైదరాబాద్ నుంచి చంద్రబాబు వస్తానంటే లాక్ డౌన్ నిబంధనలు అంటున్నారు అంటూ విరుచుకుపడ్డారు.