Asianet News TeluguAsianet News Telugu

Video : రాష్ట్రానికి ఒకటే ఇల్లు ఉండాలి..జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై చంద్రబాబు

విజయవాడ, ఇంద్రకీలాద్రిలోనిఅమ్మవారిని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు.

విజయవాడ, ఇంద్రకీలాద్రిలోనిఅమ్మవారిని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబుకు దుర్గగుడి
అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశెనేని నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రానికి ఒకటే ఇల్లు
ఉండాలన్నారు. ఐదుకోట్ల ప్రజలు ఆవేశంగా ఉన్నారని.. వారి భవిష్యత్‌ను ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.