Asianet News TeluguAsianet News Telugu

గాలిలో ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు, హైదరాబాదుకు మళ్లింపు

విజయవాడ : కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది.

విజయవాడ : కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలు ఆలస్యమవుతున్నాయి. బెంగుళూరు, హైదరాబాదుల నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. 

ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఈ విమానంలో 44 మంది ప్రయాణికులున్నారు. అదే విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు 65 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో నిరీక్షిస్తున్నారు. ఐదుసార్లు గాలిలో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానాన్ని హైదరాబాదుకు మళ్లించారు. ఉదయం 10 గంటల వరకు కూడా పొగ మంచు కొనసాగూతూనే ఉంది.