Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీనుండి విజయవాడకు చేరుకున్న స్పెషల్ ట్రైన్.. 300మంది క్వారంటైన్ కు..

లాక్ డౌన్ తరువాత మొదటిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు న్యూఢిల్లీ- చెన్నై స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడకు చేరుకుంది.

లాక్ డౌన్ తరువాత మొదటిసారిగా గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు న్యూఢిల్లీ- చెన్నై స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడకు చేరుకుంది. ఢిల్లీనుండి వచ్చిన 300 మంది ప్రయాణీకులను  ప్రత్యేక బస్సుల్లో క్వారం టైన్ కేంద్రాలకు తరలించారు. ఇక ఇదే ట్రైన్ లో 218మందిని రైల్వే అధికారులు చెన్నైకి పంపించారు. కరోనా కారణంగా దేశంలో ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చే క్రమంలో భాగంగా ఈ ట్రైన్ విజయవాడకు చేరుకుంది.