Asianet News TeluguAsianet News Telugu

చిలకలూరిపేట ఎంపీడీవో ఆఫీస్ లో అగ్ని ప్రమాదం...

పల్నాడు జిల్లా : చిలకలూరు పేట మండల ఎంపీడీవో ఆఫీస్ పై గదిలోనీ స్టాక్ రూములో అగ్ని ప్రమాదం జరిగింది. 

పల్నాడు జిల్లా : చిలకలూరు పేట మండల ఎంపీడీవో ఆఫీస్ పై గదిలోనీ స్టాక్ రూములో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది అన్వేష్ రెడ్డి తెలియజేశారు. ఈ సంఘటన గురించి తెలియగానే ఎంపీడీవో, పోలీస్ సిబ్బంది, ఎస్ఐ మోహన్ హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో పాత స్టాక్ రూమ్ లోని ఫైల్స్ అన్ని తగలబడిపోయాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశం మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.