45వ రోజుకు చేరుకున్న అమరావతి దీక్షలు
అమరావతి ఆందోళనలు 45వ రోజుకు చేరుకున్నాయి.
అమరావతి ఆందోళనలు 45వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడిలో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వెలగపూడిలో 24 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. అంతకు ముందు మందడం గ్రామంలో 24 గంటల నిరాహార దీక్ష ను మాగంటి బాబు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. మందడం దీక్ష శిబిరంలోని రైతులకు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రామకృష్ణకు సంఘీభావం తెలిపారు.