Asianet News TeluguAsianet News Telugu

Video news : ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్ షిప్ చేసి...

ఢిల్లీ కేంద్రంగా ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ పేరుతో మోసంచేస్తున్ననైజీరియా  గ్యాంగ్ ను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఎంఎంటిసిలో పని చేసి రిటైర్ అయిన సోయమిర్ కుమార్ దాస్ కు ఓ మహిళ పేరుతో నైజీరియా గ్యాంగ్ ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ చేసింది.

ఢిల్లీ కేంద్రంగా ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ పేరుతో మోసంచేస్తున్ననైజీరియా  గ్యాంగ్ ను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఎంఎంటిసిలో పని చేసి రిటైర్ అయిన సోయమిర్ కుమార్ దాస్ కు ఓ మహిళ పేరుతో నైజీరియా గ్యాంగ్ ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ చేసింది. పలు సందర్భాల్లో గిఫ్టులు, ఓచర్ల పేరిట రూ. 34,19,450 వసూలు చేశారు. తరువాత మోసపోయినట్టు గ్రహించిన సోయమిర్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు హర్యానాకి చెందిన కిషన్ లాల్ తో సహా ఇద్దరు నైజీరియా దేశస్థులను అరెస్ట్ చేశారు.