Asianet News TeluguAsianet News Telugu

వైఎస్సార్ విగ్రహానికి పేడపూసి అవమానం... గుంటూరులో ఉద్రిక్తత

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం సీఎం జగన్ తండ్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు పేడపూసి అవమానించారు. ఈ విషయం గురించి తెలిసి వైసిపి శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాన్ని శుభ్రం చేయించారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.