Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ప్రభుత్వం కులతత్వానికి పరాకాష్ట : దూళిపాళ్ళ నరేంద్ర (వీడియో)

ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ ని జగన్ తుంగలో తొక్కారని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ళ నరేంద్ర ఫైర్ అయ్యారు.  కేంద్రం ఇచ్చే నగదు ను కూడా వైసిపి తమ ఖాతా లో వేసుకుంటుందన్నారు. రైతు భరోసాలో జగన్ పచ్చి  మోసానికి పాల్పడుతున్నారని, రైతులలో కుల ప్రస్తావన తెచ్చిన తొలి ప్రభుత్వం వైసిపి అని, రైతులను కులాలుగా చీల్చీన ఘనత జగన్ కే దక్కుతుందని విరుచుకుపడ్డారు.  కేంద్రం అడ్డగోలుగా రైతులకు నగదు ఇచ్చిందని వ్యవసాయ మంత్రి మాట్లాడటం ఆశ్చర్యం అన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ ని జగన్ తుంగలో తొక్కారని టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ళ నరేంద్ర ఫైర్ అయ్యారు.  కేంద్రం ఇచ్చే నగదు ను కూడా వైసిపి తమ ఖాతా లో వేసుకుంటుందన్నారు. రైతు భరోసాలో జగన్ పచ్చి  మోసానికి పాల్పడుతున్నారని, రైతులలో కుల ప్రస్తావన తెచ్చిన తొలి ప్రభుత్వం వైసిపి అని, రైతులను కులాలుగా చీల్చీన ఘనత జగన్ కే దక్కుతుందని విరుచుకుపడ్డారు.  కేంద్రం అడ్డగోలుగా రైతులకు నగదు ఇచ్చిందని వ్యవసాయ మంత్రి మాట్లాడటం ఆశ్చర్యం అన్నారు. 


వైసిపి  అధికారం లోకి వచ్చాక 150 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాష్టం లోని రైతులందరికి రైతు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Video Top Stories