Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు.. భై రెడ్డి స్వగ్రామంలో ఉద్రిక్తత..

నందికొట్కూరు నియోజకవర్గం లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడి కొడుకు బైరెడ్డి సిధార్థ రెడ్డికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.

నందికొట్కూరు నియోజకవర్గం లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి స్వయానా తమ్ముడి కొడుకు బైరెడ్డి సిధార్థ రెడ్డికి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బి.జె.పి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులపై నందికొట్కూరు వైసీపి ఇంచార్జి బైరెడ్డి సిధార్థ రెడ్డి, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేశారు.  దీంతొ నందికొట్కూరు నియోజకవర్గంలో, ముచుమర్రి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ప్రధాన కారణం స్థానిక ఎన్నికలలో బి.జె.పి తరపున ఎమ్.పి.టి.సి అభ్యర్థులకు మద్దత్తు ఇవ్వడమేనని వారంటున్నారు. ఈ ఘటనలో సిద్ధార్థ రెడ్డి వర్గీయులలో ఒకరికి గాయాలు కావడంతో అతడిని కూడా మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.