Asianet News TeluguAsianet News Telugu

మీ బ్రతుకులు చెడ... అసమర్ద ప్రభుత్వం, చేతగాని పాలన: దేవినేని ఉమ

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రైతులు సమస్యలతో కళ్ళ వెంట కన్నీళ్లు పెడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని పంచాయతీలు గెలిచాము, మాకు అంతా మెజార్టీ వస్తుంది అని మాట్లాడుతున్నాడని అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో ఉమ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను పలకరించి వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ధాన్యాన్ని కొనుగులు చేయకుండా బూతులు మాట్లాడుతున్నారని... ఈ బూతుల మంత్రులు టీవీలో వస్తుంటే ప్రజలు చిదరించుకుంటున్నారన్నారు. మీ బ్రతుకులు చెడ... ఇదేనా మీ పరిపాలన అంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి విరుచుకుపడ్డారు.